Search This Blog


Wednesday, September 15, 2010

భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి

భారత రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులు ప్రసాదించిందని,ప్రాధమిక హక్కులు భారత రాజ్యాంగానికి మూల స్తంభాల లాంటివని మీ అందరికీ తెలుసు.అయితే అవి ఏ విధంగా సమర్ధంగా అమలు చేయబడతాయి?
కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులే ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?
ఇలాంటి సందర్భాలలో పౌరులు ఆర్టి‌‍కల్ 32 లేదా ఆర్టి‌‍కల్ 226 క్రింద సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ క్రింది రిట్లను జారీ చేయటం ద్వారా ప్రాధమిక హక్కులను కాపాడతాయి.
వీటినే రాజ్యాంగ తరుణోపాయాలు అంటారు.
  1. హెబియస్ కార్పస్: ఏ వ్యక్తి నయినా అక్రమంగా బంధించినప్పుడు,సంబంధిత అధికారి/వ్యక్తి కి స్వాధీనంలోని వ్యక్తిని తెచ్చి చూపి,కారణం తెలియపరచవలసిందిగా ఇచ్చే ఆజ్ఞ.
  2. మాండమస్: ఏదైనా రాజ్యంగ లేదా శాసన విధిని నిర్వర్తించమని కానీ, అమలుచేయరాదని కానీ భాద్యులైన ప్రభుత్వ అధికారులకు,క్రిందికోర్టులకు ఇచ్చే ఆజ్ఞ.
  3. ప్రొహిబిషన్: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరినప్పుడు, తీర్పు వెలువరించకుండా నిషేధిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
  4. సెర్షియరరీ: ఇది క్రిందికోర్టులు తమ పరిధి మీరి ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ ఇచ్చే ఆజ్ఞ.
  5. కో వారంటో:ఎవరైనా వ్యక్తికి పబ్లిక్ పదవి పొందుటలో గల శాసనబద్దతను ప్రశ్నిస్తూ ఇచ్చే ఆజ్ఞ.
అందుకే 32 ఆర్టికల్ ను రాజ్యాంగానికి ఆత్మ/హృదయం అంటారు.

No comments:

Post a Comment